ఎవరెన్ని చెబుతున్నా..డ్రగ్స్ కేసులో సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల విచారణకు రంగం సిద్ధం అవుతోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రముఖులు నేరుగా స్పందించకపోయినా వారి తరపున వారి వారి కుటుంబ సభ్యులు మాత్రం డ్రగ్స్ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అయినా ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మాత్రం విచారణకు రంగం సిద్ధం చేశారు. అందులో భాగంగా ఈ నెల 19న ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ను సిట్ అధికారులు విచారించనున్నారు. అదే సమయంలో 20న హీరోయిన్ ఛార్మీ, 21న ప్రత్యేక గీతాల నటి ముమైత్ ఖాన్, 22న నటుడు సుబ్బరాజు, 23న ప్రముఖ కెమెరామ్యాన్ ఛోటాకే నాయుడు సిట్ ఎదుట హాజరుకాబోతున్నారు.
Related Articles
ప్రముఖ హీరో రవితేజ ఈ నెల 24న సిట్ ముందు హాజరు కానున్నారు. ఈ నెల 25న ఆర్ట్ డైరెక్టర్ చిన్నాను, 26న హీరో నవదీప్, 27న హీరో తరుణ్, 28న యువ హీరోలు తనీష్, నందులను సిట్ విచారించనుంది. పేరుమోసిన డ్రగ్స్ సరఫరాదారుడు కెల్విన్ కాల్లిస్ట్ ఆధారంగా వీరికి తెలంగాణ ఎక్సైజ్శాఖ నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే. వీరంతా డ్రగ్స్ వాడారా? లేక విక్రయించారా? అసలు సినీ పరిశ్రమలోకి డ్రగ్స్ ఊడలు ఎలా పాకాయి? ఎవరెవరు ద్వారా డ్రగ్స్ సరఫరా అవుతోంది? ఎవరెవరు డ్రగ్స్ కు బానిసలు అయ్యారు? అనే కోణంలో సిట్ విచారణ కొనసాగనుంది. విచారణకు హాజరయ్యే వారందరూ దోషులుగా చెప్పలేమని..విచారణ తర్వాతే అసలు విషయాలు బయటికి వస్తాయని చెబుతున్నారు.
The post డగ్స్ కేసులో విచారణ. పూరీ 19న..రవితేజ 24న appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here