అంతా రెడీ అనుకున్న సమయంలో ప్రభాస్ అభిమానులకు ఊహించని షాక్. ఆగస్టు 15న విడుదల కావాల్సిన సాహో సినిమాకు బ్రేకులు పడ్డాయి. ఈ సినిమా విడుదల ఆగస్టు30కి వాయిదా పడింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. నిర్మాణానంతరం కార్యక్రమాల విషయంలో జాప్యం సినిమా విడుదల వాయిదాకు కారణమైంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమా ఏమీ లేకపోవటంతో ఆయన అభిమానులు ‘సాహో’ విడుదల ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Related Articles
ఇందులో ప్రభాస్ కు జోడీగా శ్రద్ధా కపూర్ నటించిన విషయం తెలిసిందే. సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. భారీ భారీ యాక్షన్ సన్నివేశాలతో సాహోను తెరకెక్కించారు. ఈ సినిమాలో కొన్ని నిమిషాల సన్నివేశాల కోసమే సుమారు 70 కోట్ల రూపాయల వరకూ ఖర్చు పెట్టినట్లు టాలీవుడ్ టాక్. ఏది ఏమైనా ప్రభాస్ అభిమానులు తమ హీరో సినిమా కోసం అనుకున్న దాని కంటే మరో 15 రోజులు ఎక్కువ వేచిచూడాల్సి వస్తోంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here