తెలుగు బిగ్ బాస్ ఎప్పుడూ లేని రీతిలో ఈ సారి తీవ్ర వివాదంలో కూరుకుపోయింది. ఏకంగా ఇద్దరు మహిళలు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్లలో కేసు నమోదు చేయటంతో ఈ వివాదం ఎన్నో మలుపులు తిరుగుతోంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఆరోపణలు బయటకు రాలేదు. ఓ వైపు అసలు బిగ్ బాస్ షోలపైనే తీవ్ర విమర్శలు ఉన్న తరుణంలో తాజా ఆరోపణలు మాత్రం కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్. బిగ్ బాస్ 3 అసలు ముందుకు సాగుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ఈ షో నిర్వాహకులపై యాంకర్, జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ రియాల్టీ షోపై మరో పిటిషన్ దాఖలైంది.
Related Articles
షో హోస్ట్ నాగార్జునతో పాటు మరో 10 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ పిల్ దాఖలైంది. ఈ షోలో అభ్యంతరకర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉందని, అందుకే సినిమాలాగే ప్రతి ఎపిసోడ్ను సెన్సార్ చేసి ప్రసారం చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బిగ్బాస్ షో కోఆర్డీనేషన్ టీం తెలంగాణ హైకోర్టు గడప తొక్కింది. ఈ షోపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేసింది. ‘బిగ్బాస్ 3’ పై బంజారాహిల్స్, రాయదుర్గం పోలీసు స్టేషన్లతో నమోదైన కేసులను వెంటనే కొట్టివేయాలని పిటిషన్లో కోరింది. అయితే బిగ్బాస్ టీం దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను అనుమతించొద్దంటూ జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా హైకోర్టు వద్ద నిరసనకు దిగారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here