తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు కొత్త పంచాయతీ మొదలైంది. పార్టీ నేతల మధ్య ‘ట్విట్టర్ వార్’ ముదురుతోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నల మధ్య ఈ వ్యవహారం ముదిరిపాకాన పడుతోంది. కేశినేని నాని, బుద్ధా వెంకన్నలు ఇఫ్పుడు ట్విట్టర్ లో యుద్ధం మొదలెట్టారు. నాని ట్వీట్ పై బుద్ధా వెంకన్న వెంటనే రియాక్ట్ అయ్యారు. ‘సంక్షోభ సమయంలో పార్టీ కోసం…నాయకుడి కోసం పోరాడేవాడు కావాలి. ఇతర పార్టీ నాయకులతో కలిసి కూల్చేవాడు ప్రమాదకరం.
Related Articles
నీలాగా అవకాశవాదులు కాదు..చనిపోయేవరకూ చంద్రబాబు కోసం సైనికుడిలా పోరాడేవాడు కావాలి’ అంటూ ట్వీట్ చేశారు. దీని కంటే ముందు కేశినేని నాని ట్వీట్ చేస్తూ.. నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడని విమర్శించారు. నాలుగు పదాలు చదవలేని వాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు ట్వీట్ చేస్తున్నాడు… ఇది మన దౌర్భాగ్యం అంటూ ట్వీట్లో ఎద్దేవా చేశారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here