వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రస్తుతం కరకట్ట వద్ద ఉంటున్న ఇంటిని ఖాళీ చేయించుతామని స్పష్టం చేశారు. ఇది అక్రమ నిర్మాణం అని తేల్చిచెప్పారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో ఉందని అన్నారు. అమరావతి గురించి ఎన్నో గొప్పలు చెప్పే మాజీ సీఎం చంద్రబాబు కనీసం అమరావతిలో సొంత ఇంటిని ఎందుకు నిర్మించుకోలేకపోయారని ఆర్కే ప్రశ్నించారు. రాజధాని పనులు ఎందుకు ఆగిపోయాయో తనకు తెలియదని..దీనిపై కాంట్రాక్టర్లే ఏమైనా చెప్పాలన్నారు. అమరావతి పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఎందుకు అంత ఆందోళన చెందుతున్నారో అర్థం కావటంలేదన్నారు. కాంట్రాక్టర్లకు ఏమైనా సందేహాలుంటే ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చని అన్నారు.
Related Articles
కరకట్ట వద్ద తాను ఉంటున్న నివాసానికి అనుబంధంగా నిర్మించిన ప్రజా వేదికను ప్రతిపక్ష నేతగా ఉన్న తనకు సమావేశాలు నిర్వహించుకునేందుకు కేటాయించాలని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం ఘాటుగా స్పందించారు. ఇలా కేటాయిస్తూ పోతే లోకేష్ కు ప్రకాశం బ్యారేజీ, మరొకరికి పోలవరం ప్రాజెక్టు కూడా కేటాయించాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డికి త్వరలోనే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్ డీఏ) ఛైర్మన్ గా నియమిస్తారని చెబుతున్నారు. ఈ తరుణంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here