చాలా మందికి సెలబ్రిటీలతో ఫోటో దిగాలని కోరిక ఉంటుంది. అభిమానుల ఫోటో రిక్వెస్ట్ లను కొంత మంది సెలబ్రిటీలు ఒప్పుకుంటారు. మరికొంత ఓవర్ యాక్షన్ కూడా చేస్తారు. అదే సమయంలో మహిళా సెలబ్రిటీలతో మిస్ బిహేవ్ చేసేవారూ ఉంటారు. ఆ సంగతి కాస్త పక్కన పెడితే ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గా తాజా ఓ విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఆయన వెల్లడించిన విషయాలు షాకింగ్ కు గురిచేసేలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రకాష్ రాజ్ తన కుటుంబ సభ్యులతో కలసి కాశ్మీర్ లో పర్యటించారు. ఆ సమయంలో ఓ మహిళ తన కుమార్తెతో కలసి ప్రకాష్ రాజ్ తో సెల్ఫీ దిగింది. అంతే..ఆమె భర్త హడావుడిగా వచ్చి తనతో సెల్ఫీ దిగినందుకు భార్యను దూషించాడని తెలిపారు. అంతే కాదు.. ఆ సెల్ఫీని ఫోన్ నుంచి డిలీట్ చేయాలని ఒత్తిడి చేశాడు. ఈ ఘటన తనను ఎంతో బాధించిందని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. విభిన్న అభిప్రాయాలు ఉన్నంత మాత్రాన సొంత వ్యక్తులను ఎందుకు అంతగా బాధపెడతారు అని ప్రశ్నించారు. ఆ ఘటన వివరాలను ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘ఓ మహిళ తన కుమార్తెతో కలసి నా వద్దకు వచ్చారు
Related Articles
. సెల్ఫీ కావాలని అడిగారు. నేను ఓకే అన్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. ఒక్కసారిగా అక్కడకు ఆమె భర్త వచ్చారు. అమెను పక్కకు లాగి దూషించారు. సెల్ఫీ డిలీట్ చేయమని కేకలు వేశారు. నేను మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయన ఇలా ప్రవర్తించారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటకులు అందరూ మమ్మల్ని చూశారు. ఆ మహిళ కన్నీరు పెట్టుకున్నారు. నేను ఆయన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడా. ఈ ఘటన గుల్మార్గ్ లోని హోటల్ లో జరిగింది. ఆమె భర్తను పక్కకు తీసుకెళ్ళి…సార్..ఆమె నిన్ను పెళ్ళి చేసుకుని ..అందమైన కుమార్తెను నీకిచ్చి జీవితాన్ని పంచుకోవటానికి …నేను, మోడీ కారణం కాదు. వారు మీ అభిప్రాయాలను గౌరవిస్తున్నప్పుడు ..మీరు అలాగే వారిని గౌరవించండి. విహారయాత్రను ఎంజాయ్ చేయండి’ అని చెప్పా. ఆయన మాత్రం మౌనంగా ఉండిపోయారే తప్ప ఏమీ మాట్లాడలేదు. నేను బాధతో అక్కడ నుంచి వచ్చేశా. వాళ్ళు నా ఫోటోను డిలీట్ చేశారా..ఉంచారా అన్నది ఇక్కడ విషయం కాదు. కానీ వాళ్ళ మనసుకు అయిన గాయాన్ని నయం చేయగలడా? అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here