గత కొంత కాలంగా యూట్యూబ్ ఛానల్స్ గతంలో ఎన్నడూలేని రీతిలో వివాదాల్లో ఇరుక్కుంటున్నాయి. ప్రధానంగా సెలబ్రిటీలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ వీడియోలు తయారు చేసి యూట్యూబ్ లో పెడుతున్నారు. వాటికి వ్యూస్ కూడా పెద్ద ఎత్తున వస్తుండటంతో..కొంత మంది ఛానల్ నిర్వాహకులు మంచి, చెడు అన్న అంశాలను వదిలేసి..డబ్బు సంపాదనే లక్ష్యంగా ఈ పని చేస్తున్నారు. సెలబ్రిటీల ఫిర్యాదు లు చేయటం చివరకు కొంత మంది అరెస్ట్ కూడా అవుతున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ ఏకంగా 50 యూట్యూబ్ ఛానళ్ళపై ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇఛ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదన్నారు.
Related Articles
గత రెండేళ్లుగా తన పేరుతో కొంతమంది యూట్యూబ్లో వీడియో లింక్స్ పెడుతూ.. మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె తెలిపారు. దాదాపు 50 యూట్యూబ్ ఛానల్స్పై ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఆన్లైన్లో ఇలా అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. వీడియో షేరింగ్ వెబ్సైట్ యూట్యూబ్లో కొందరు ఉద్దేశపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు పోస్టు చేస్తున్నారని ఆమె తన ఫిర్యాదులో తెలిపారు. తనను కించపరిచేవిధంగా, నా వ్యక్తిత్వాన్ని అవమానించేలా యూట్యూబ్లో కొందరు పోస్టులు పెడుతున్నారని, సోషల్ మీడియాలోనూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇలా పుకార్లు సృష్టించి.. దుష్ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నటి పూనమ్ కౌర్ సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here