ఇదీ తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు. ‘గోద్రాలో 2వేలమంది నరమేధాన్ని మరువలేం. విదేశాలు కూడా మోడీని బాయ్ కాట్ చేశాయి. సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభుత్వాల అస్థిరత ప్రమాదకరం. సరిహద్దు రాష్ట్రాలలో రాజకీయ లబ్దిని చూడరాదు. బిజెపి రాజకీయాలతోనే జమ్ము-కాశ్మీర్ లో సంక్షోభం. పుల్వామా దాడిపై మమతా బెనర్జీ అనుమానాలపై దేశంలో చర్చ. దేశభక్తిలో,భద్రతలో టిడిపి రాజీపడదు. రాజకీయ లబ్దికోసం దేశాన్ని తాకట్టు పెట్టడాన్ని సహించం.’ అని వ్యాఖ్యానించారు.
Related Articles
మంగళవారం నాడు పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సుఖీభవ కింద ఇఫ్పటికే రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,000 వేశామని తెలిపారు. డబ్బు తీసుకోడానికి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఈ స్కీమ్ పై రాష్ట్రవ్యాప్తంగా రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఏపిలో రైతులకు చేసినంతగా దేశంలో ఎక్కడా చేయలేదన్నారు. రూ.24వేల కోట్ల రుణమాఫీ, విపత్తు సాయం పెంపు వంటి ఎన్నో స్కీమ్ లు అమలు చేసినట్లు తెలిపారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here