Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

జగన్ పై దాడి కేసు..ఎన్ఐఏ విచారణపై స్టేకు హైకోర్టు నో

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి పై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన దాడి కేసులో జాతీయ పరిశోధనా సంస్థ (ఎన్ఏఐ) విచారణపై స్టే ఇవ్వటానికి హైకోర్టు నిరాకరించింది. గత శనివారం నాడే అత్యవసరంగా  ఈ కేసును విచారించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. అయితే అత్యవసరంగా ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని..సోమవారం వింటామని హైకోర్టు తెలిపింది. అన్నట్లుగానే ఈ సోమవారం కేసును విచారించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు ఎన్ఐఏ విచారణ పై స్టే ఇవ్వటానికి కోర్టు నిరాకరించింది.

అయితే జనవరి 30లోగా ఈ అంశంపై కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఎన్ఐఏ అంశం కేంద్ర, రాష్ట్రాల పరిధికి సంబంధించింది అయినందున హైకోర్టుకు అసలు ఈ కేసును వినకూడదని..సుప్రీంకోర్టు మాత్రమే ఈ కేసులో వాదనలు వినాలని జగన్ తరపు లాయర్లు వాదించారు. కేంద్రం కౌంటర్ దాఖలు చేసిన తర్వాత మరోసారి దీనిపై వాదనలు జరగనున్నాయి. ఎన్ఐఏ విచారణకు సంబంధించిన అంశాలను కూడా కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

జగన్ పై దాడి కేసు..ఎన్ఐఏ విచారణపై స్టేకు హైకోర్టు నో

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×