లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పక్కాగా ప్రధాని మోడీపై అస్త్రాలు సందిస్తున్నారు. దేశంలోని రైతులందరికీ మేలు చేసే వరకూ ఆయన్ను నిద్రపోనివ్వమని వ్యాఖ్యానించారు. అందుకు తాజాగా కొలువుదీరిన తమ ప్రభుత్వాల రుణ మాఫీ అంశాన్ని కూడా రాహుల్ ప్రస్తావించారు. మధ్యప్రదేశ్, చత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైతులకు రుణమాఫీ ప్రకటించాయని, రాజస్ధాన్ ప్రభుత్వం కూడా ఈ దిశగా చర్యలు చేపట్టబోతోందని రాహుల్ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాల తరహాలో కేంద్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని డిమాండ్ చేశారు.
Related Articles
తమ పార్టీ ఇటీవల రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ఆరు గంటల్లోనే రైతు రుణాల మాఫీ ప్రకటించిందని, మూడో రాష్ట్రంలో కూడా రుణమాఫీకి కసరత్తు సాగుతోందన్నారు. రైతు రుణాల మాఫీ దిశగా ప్రధాని చర్యలు తీసుకునే వరకూ తాము ప్రధాని మోదీని విశ్రాంతి తీసుకోనీయమని రాహుల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విడగొట్టారని, ఒక భారత్లో రైతులు, పేదలు, యువత, చిన్న వ్యాపారులుండగా, మరో భారత్లో కేవలం దేశంలోని పదిహేను మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలున్నారని ధ్వజమెత్తారు. ఇటీవలి పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తమకు సామాన్య ప్రజలతో కూడిన భారతీయులు పట్టం కట్టారని అన్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here