రజనీకాంత్ సినిమా అంటే ఆ క్రేజే వేరు. ఇప్పటికే రకరకాల కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న 2.ఓ చిత్రం ఎట్టకేలకు విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రజనీ సినిమా అంటేనే భారీ అంచనాలు ఉంటాయి. అందులో శంకర్ దర్శకత్వం అయితే అంచనాలు కొత్త ఎత్తుకు చేరుకుంటాయి. 2.ఓ విషయంలో ఇప్పుడే అదే జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన 2.ఓ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీంతో ఈ సినిమా కొనుగోలుకు చాలా మంది పోటీలు పడుతున్నారు. ఈ పోటీని నివారించి..ఎవరు ఎక్కువ రేటు ఇస్తే వారికే సినిమా హక్కులు కేటాయించేలా వేలం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
Related Articles
వేలం ద్వారా ఈ సినిమా ‘రికార్డు’ ధరను అందుకోవటం ఖాయం అని చెబుతున్నారు. ఇలా సినిమాను వేలం నిర్వహించటం అరుదైన విషయంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో రజనీకాంత్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, ఎమీజాక్సన్ లు నటించారు. ఐదు వందల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో తెరకెక్కిన ఈ సినిమానే భారత్ లో నిర్మించిన అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా కూడా రికార్డులకు ఎక్కనుంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్, వీఎఫ్ఎక్స్ వంటి సాంకేతిక పరిజ్ఙానం హాలీవుడ్ చిత్రాలను తలదన్నే విధంగా ఉండబోతోంది. రజనీకాంత్ నటించిన రోబో సినిమాకు సీక్వెల్ గానే ఇది వస్తోంది. రోబో సినిమా ఎన్ని సంచలనాలు నమోదు చేసిందో తెలిసిందే. మరి ఇప్పుడు 2.ఓ పేరిట ఎన్ని రికార్డులు నమోదు అవుతాయో వేచిచూడాల్సిందే.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here