లోక్ సభలో శుక్రవారం నాడు ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపర్చింది. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా సర్కారును..ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఓ పని పెద్ద కలకలం రేపింది.. తన ప్రసంగం పూర్తైన వెంటనే రాహుల్ నేరుగా ప్రధాని మోడీ సీటు వద్దకు వెళ్లారు. పైగా సైగలు చేస్తూ ఆయన్ను లేవాల్సిందిగా కోరారు. మోడీకి ఏమిటో అర్థం కాలేదు. అంతలోనే రాహుల్ గాంధీ తన సీట్లో కూర్చున్న మోడీని కౌగిలించుకున్నారు.
Related Articles
ఈ హఠాత్ పరిణామంతో మోడీ కూడా అవాక్కు అయి..వెళుతున్న రాహుల్ ను వెనక్కి పిలిచి షేక్ హ్యాండ్ ఇచ్చి పంపారు. ఆ తర్వాత తన సీట్లో కూర్చున్న రాహుల్ గాంధీ పక్కన ఉన్న వాళ్లు ఏదో అడిగారు. ఆ సమయంలో రాహుల్ ‘కన్ను గీటారు’. అది కూడా టీవీల్లో…సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తోంది. మొత్తానికి రాహుల్, మోడీల బలవంతపు కౌగిలింత హాట్ టాపిక్ గా మారింది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here