ఓవర్సీస్ లో భారీ వసూళ్ళు రాబట్టాలంటే అది టాలీవుడ్ టాప్ హీరోలే అయి ఉండాలి. అప్పుడే అక్కడ కూడా డాలర్ల వర్షం కురుస్తుంది. కానీ కథలో సత్తా ఉంటే…దానికి టాప్ హీరోలు అక్కర్లేదు…కమర్షియల్ సినిమా కూడా కావాల్సిన అవసరం లేదని నిరూపించింది ‘మహానటి’. ఎందుకంటే మహానటి సినిమా ఇప్పటికే ఒవర్సీస్ లో రెండు మిలియన్ల వసూళ్ళను అధిగమించింది. రాబోయే రోజుల్లో ఈ మొత్తం మరింత పెరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో అయితే మల్టీప్లెక్స్ ల్లో ఈ సినిమా ఇప్పటికీ హౌస్ ఫుల్ కలెక్షన్లతోనే ముందుకు సాగుతుంది. సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమా కావటంతో పాత తరం వారితో పాటు..కొత్తతరం ప్రేక్షకులను కూడా ఈ సినిమాను పెద్ద ఎత్తున వీక్షిస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ఫుల్ కుషీతో ఉంది.
Related Articles
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించి…పెద్ద ఎత్తున అభినందనలు అందుకున్నారు. కీర్తిసురేష్ ఇమేజ్ ఈ సినిమాతో ఒక్కసారిగా మారిపోయిందని చెప్పొచ్చు. ఈ నెల9న విడుదల అయిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కాయి. వైజయంతి మూవీస్, స్వప్నా సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, రాజేంద్ర ప్రసాద్లు ఇతర కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here