టీటీడీ బోర్డు నుంచి ఎమ్మెల్యే అనితను తప్పిస్తే…ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన తప్పును ఒప్పుకున్నట్లు అవుతుంది. అంటే ఏ మాత్రం పరిశీలించకుండా ఇష్టానుసారం బోర్డు సభ్యుల నియామకం చేసినట్లు అంగీకరించినట్లే. అందుకే ఈ కొత్త రూట్ ను ఎంచుకున్నారు. చంద్రబాబును వివాదం నుంచి బయటపడేసేందుకే అనితతోనే రాజీనామా లేఖ ఇప్పించారు. తాను హిందువునేనని..కొంత మంది కావాలని ఓ వీడియోను పట్టుకుని చంద్రబాబును టార్గెట్ చేస్తున్నారని అనిత తన లేఖలో పేర్కొన్నారు. అందుకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొన్నారు. తనకు టీటీడీ బోర్డులో అవకాశం కల్పించిన చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
Related Articles
తనపై కొన్ని గ్రూపులు..కొంత మంది దురుద్దేశపూర్వకంగా వివాదం సృష్టించారని ఆరోపించారు. తాను వెంకటేశ్వరస్వామి భక్తురాలినని..ఎన్నోసార్లు దైవదర్శనం కూడా చేసుకున్నానని అనిత తన లేఖలో పేర్కొన్నారు. అనసరమైన ఈ వివాదాన్ని కొనసాగించటానికి తాను కేంద్రం కాదలచుకోలేదని..అందుకే తనను టీటీడీ బోర్డు పదవి నుంచి తప్పించాలని కోరుతూ లేఖ రాశారు. దీంతో చంద్రబాబు చేతికి మట్టి అంటకుండా అనిత కోరినందుకే..బోర్డు నుంచి ఆమెను తప్పిస్తారన్నట మాట.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here