Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆప్ కు షాక్…20 మంది ఎమ్మెల్యేలపై వేటు

Tags: agravedeg

ఢిల్లీలోని అధికార ఆమ్ అద్మీ పార్టీ (ఆప్)కి భారీ షాక్. ఆ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ రాష్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆదివారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఎమ్మెల్యేలుగా ఉంటూ లాభదాయక పదవుల్లో కొనసాగిన 20 మంది ఎమ్మెల్యేలపై వేటు వేశారు. 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సిఫారసు చేయగా.. ఈ సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించారు. ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో ఈ 20 స్థానాలకు త్వరలో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశముంది. 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించినప్పటికీ కేజ్రీవాల్‌ సర్కారుకు ముప్పు లేదు.

మేజిక్‌ ఫిగర్ 35 కాగా, 20 మంది వేటు పడినా ఆప్‌కు ఇంకా 46 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. అయితే 20 స్థానాలకు మళ్లీ ఎన్నికలు జరిగితే కేజ్రీవాల్‌ ప్రభుత్వానికి మరో సవాల్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎన్నికల సంఘం సిఫారసుపై ఆప్ హైకోర్టును ఆశ్రయించిన  ప్రయోజనం లేకుండా పోయింది. సోమవారం ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్న సమయంలోనే..ఆదివారం నాడు రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరి ఇప్పుడు సుప్రీంలో ఆప్ కేసు దాఖలు చేస్తుందా? లేదా వేచిచూడాల్సిందే.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఆప్ కు షాక్…20 మంది ఎమ్మెల్యేలపై వేటు

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×