ఏపీ ప్రభుత్వం ఇటీవలే నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను సీఎం వైయస్ జగన్ మంగళవారం విడుదల చేశారు. 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి గాను గత నెల 20 నుంచి 26వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు. 19 రకాల పోస్టుల కోసం 14 రకాల పరీక్షలు నిర్వహించారు. దాదాపు 7.69 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుయ్యారు. రికార్డు సమయంలో ఓఎంఆర్ సమాధాన పత్రాలను స్కాన్ చేశారు. 7,68,965 మంది అభ్యర్థుల ఓఎంఆర్ సమాధాన పత్రాలను గత నెల 21 నుంచి 27వ తేదీ వరకు అధికారులు స్కాన్ చేశారు.
Related Articles
ఆ ఫలితాలను ఆ రంగంలో నిష్ణాతులైన గణాంకాల బృందం (స్టాటిస్టికల్ టీమ్) ద్వారా మరోసారి పరిశీలించి.. నేడు తుది ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం: www.gramasachivalayam.ap.gov.in, www.wardsachivalayam.ap.gov.in తో పాటు www.vsws.ap.gov.in వెబ్సైట్లో చూడవచ్చన్నారు. సీఎం జగన్ వినూత్న ఆలోచనతో గ్రామ, వార్డు సచివాలయలు ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పాలన ప్రతి ఇంటి గుమ్మం ముందుకు వెళ్ళిందని పెద్దిరెడ్డి తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాల ఫలాలు అందరికి అందుబాటులోకి వచ్చాయన్నారు.