ఇంజనీరింగ్, డిప్లొమా చేసిన వాళ్లకు మంచి అవకాశం వచ్చింది. జూనియర్ ఇంజనీర్ పోస్టులకు భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.అయితే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నదనే విషయాన్ని ప్రకటించలేదు. పరీక్ష సమయానికి పోస్టుల సంఖ్యను కమిషన్ వెబ్సైట్లో ప్రకటించనుంది.
Related Articles
దేశంలో కేంద్ర మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు సెంట్రల్ వాటర్ కమిషన్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, మిలటరీ ఇంజినీర్ సర్వీస్, ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్టు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరన్స్ , నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర సంస్థల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు :-
ఈ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమా చేసి ఉండాలి. ఆయా విభాగానికి సంబంధించిన అనుభవం ఉండాలి.
వయసు:- అప్లై చేసే అభ్యర్థులు జనవరి 01, 2021 నాటికి వాటర్ కమిషన్, పబ్లిక్ వర్క్స్ పోస్టులకు 32 ఏళ్లు ఉండాలి. మిగిలిన ఉద్యోగాలకు 30 ఏళ్లు మించకూడదు
ఎంపిక విధానం:-. అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, డిస్క్రిప్టివ్ టెస్ట్ను నిర్వహించడం జరుగుతుంది. అందులో వారి మెరిట్ను బట్టి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ టెస్ట్ల్లో భాగంగా మొదటి పేపర్ 2021 మార్చి 22 నుంచి 25 వరకు నిర్వహిస్తారు. పేపర్-2 పరీక్షా తేదీ తర్వాత వెల్లడిస్తారు.
పరీక్ష కేంద్రాలు:- ఈ పరీక్షలను సదరన్ రీజియన్ అంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరునల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం :-
ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. https://ssc.nic.in/ అనే వెబ్సైట్లోకి అక్టోబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. నవంబర్ ఒకటో తేదీకల్లా పరీక్ష ఫీజు చెల్లించాలి.