భారత దేశంలో అతిపెద్ద ఆయిల్ పైప్ లైన్ రిఫైనరీ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి దేశవ్యాప్తంగా వివిధ రిఫైనరీలలో ఖాళీగా ఉన్న ఎక్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. ఎంపికయిన వారు ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని వివిధ రిఫైనరీలలో పనిచేయాలి.
వివరాలు :
పోస్టు పేరు : ఎక్జిక్యూటివ్
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 22 పోస్టులు ఉండగా ఇందులో ఆంధ్రప్రదేశ్ కి రెండుపోస్టులు ఉన్నాయి.
పోస్టులవివరాలు :
1) టెక్నికల్ అటెండెంట్ - 09 పోస్టులు
2) ఇంజనీరింగ్ అసిస్టెంట్ - 12 పోస్టులు
3) జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ - 01 పోస్టు
అర్హతలు :
1) టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు పదవతరగతి మరియు ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
2) ఇంజనీరింగ్ అసిస్టెంట్ పోస్టులకు మెకానికల్/ ఆటోమొబైల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఇన్స్ట్రుమెంటేషన్/ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్టు లలో ఫుల్ టైం డిప్లొమా లేదా ఐటిఐ తరువాత కనీసం రెండుసంవత్సరాల డిప్లొమా కోర్స్ పూర్తి చేసి ఉండాలి.
3) జూనియర్ ఆఫీస్ అస్సిస్ట్నట్ పోస్టులకు ఏదయినా డిగ్రీ 55% మార్కులతో పాస్ అయి ఉండాలి.
శాలరీ : రూ. 11,900/- నుండి 32,000/- వరకు
అప్లికేషన్ ఫీజు : అప్లై చేసుకునే అభ్యర్థులు జనరల్/ఓబిసి/ఏడబ్ల్యూస్ అభ్యర్థులు 100 రూపాయలు చెల్లించాలి. మిగతావారికి ఫీజు లేదు.
ఎంపిక విధానము : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష మరియు స్కిల్ / ప్రొఫిషియెన్సీ టెస్ట్/ ఫిజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. రాతపరీక్షను 20 అక్టోబర్ 2019 ఆదివారం నాడు నిర్వహిస్తారు.
అర్హులయిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 02 సెప్టెంబర్ 2019 నుండి 23 సెప్టెంబర్ 2019 లోపు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. వివరాలకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోగలరు.
DOWNLOAD PDF CLICK HERE