అనంతపురం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ‘బుక్ మై ప్లాట్' సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీసీలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు.
అభ్యర్థులు కనీసం పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. నెలకు రూ.10 వేల వేతనం ఇస్తారన్నారు. ఇంటర్వ్యూకు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ కార్డ్, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు 8885865038 నెంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.