Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అందరూ తప్పక చూడాల్సిన సినిమా: ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

అల్లరి నరేష్ ఎన్నికల అధికారిగా నటిస్తున్న సోషల్ డ్రామా మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఏఆర్ మోహన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్ తో కలిసి హాస్య మూవీస్పై రాజేష్ దండా నిర్మించారు. ఆనంది కథానాయిక. ఈ చిత్రం ఈ నెల 25న థియేటర్లలో విడుదలౌతున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది.

అల్లరి నరేష్ మాట్లాడుతూ, “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ఒక నిజాయితీ గల సినిమా. మన చుట్టూ జరిగే కథ. సినిమా అద్భుతంగా వచ్చింది. దర్శకుడు మోహన్, ఆర్ట్  డైరెక్టర్ బ్రహ్మ కడలి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్, డీవోపీ రాంరెడ్డి, మాటల రచయిత అబ్బూరి రవి గారు.. టీం అంతా కలసి చాలా మంచి వర్క్ చేశాం. చివరి ఇరవై నిమిషాల్లో చాలా కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ ని ఫైట్ మాస్టర్ పృద్వీ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. సినిమా చూసిన తర్వాత సంగీత దర్శకుడు శ్రీచరణ్, మాటల రచయిత అబ్బూరి రవి గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటారు. నాంది తర్వాత నిర్మాత సతీష్ గారికి ఎంత పేరొచ్చిందో.. ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం కూడా నిర్మాత గా రాజేష్ కి మంచి పేరు తీసుకొస్తుంది. అందరూ కష్టపడి, ఇష్టపడి చేసిన సినిమా ఇది.  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం జనం సినిమా. జనం అంటే మనం. మన చుట్టుపక్కల జరిగే కథ. ప్రేక్షకులు కొత్త కంటెంట్ ని కోరుకుంటున్నారు. కొత్త ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకంని ఆదరిస్తారనే నమ్మకం వుంది. రేపు సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్ లో చూడాలి. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం” అన్నారు.

The post ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అందరూ తప్పక చూడాల్సిన సినిమా: ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ appeared first on Viral Gaze.



This post first appeared on Bead And Jewelry History, please read the originial post: here

Share the post

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం అందరూ తప్పక చూడాల్సిన సినిమా: ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్

×

Subscribe to Bead And Jewelry History

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×