ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిపై బిజెపి దూకుడు పెంచింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నుంచి మొదలుకుని ఏపీ బిజెపి నేతలు అందరూ టీడీపీ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. పాత మిత్రులు నిత్యం తమపై విమర్శలు చేసే పనిలోనే ఉన్నారని చంద్రబాబు పేరెత్తకుండా నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. వాస్తవానికి గత ఐదేళ్ళ కాలం ఏపీకి స్వర్ణయుగం లాంటిది అని పేర్కొన్నారు. ఈ కాలంలో జరిగిన ప్రగతిపై ఎవరైనా పరిశీలించుకకోవచ్చని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో కేంద్రమే నిధులు ఇస్తున్నా చంద్రబాబు మాత్రం తాను సొంతంగా ప్రాజెక్టు కట్టుకుంటున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు.
Related Articles
సోమవారం విజయవాడలో బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా నితిన్ గడ్కరీ హాజరై మాట్లాడుతూ.. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేస్తుందని చెప్పారు. కేంద్రం అందించిన నిధుల నివేదికలను మేధావులు పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించినందుకు గడ్కరీని రాష్ట్ర బీజేపీ నేతలు సన్మానించారు. రాష్ట్ర బిజెపి నేతలు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here