తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) హైదరాబాద్ లోని కొంగరకలాన్ లో నిర్వహించే సభకు సంబంధించిన విచిత్రాలు ఎన్నో. రాష్ట్రమంతటి నుంచి జనసమీకరణకు టీఆర్ఎస్ అధిష్టానం భారీ టార్గెటే పెట్టింది. చెప్పేది 25 లక్షలు అయినా..సంఖ్య మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అన్ని జిల్లాల తరహాలోనే ఖమ్మం నుంచి కూడా భారీ ఎత్తున ట్రాక్టర్లు బయలుదేరాయి. ముందు ట్రాక్టర్ల నిండా జనం కన్పించారు. ఇది చూసిన వారంతా అబ్బో..ఏమి జనం ఏమి జనం అనుకున్నారు. తీరా ఆ ట్రాక్టర్లు హైవే ఏక్కిన తర్వాత చూస్తే అందులో ఒక్కరూ లేరు.
Related Articles
ట్రాక్టర్ నడిపే డ్రైవర్ తప్ప..అందులో ఎవరూ లేకుండానే అవన్నీ కొంగరకలాన్ వైపు బయలుదేరాయి. ఇది చూసిన వారంతా అవాక్కయ్యే పరిస్థితి. కొంత మంది ట్రాక్టర్ నడిపే వాళ్లను ఎందుకు ఖాళీగా వెళుతున్నాయి అని ప్రశ్నిస్తే..అదంతా తమకు తెలియదని..డబ్బులు ఇచ్చారని సభకు వెళుతున్నామని చెప్పేశారు. ఈ హంగామా చూసిన వారంతా అతడు సినిమాలో ఓ డైలాగ్ ను గుర్తు తెచ్చుకుని మరీ పోస్టింగ్ లు పెట్టారు. ఖాళీ ట్రాక్టర్ల వ్యవహారం సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here