తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం నాడు హాట్ హాట్ గా సాగింది. ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్నారనే అంశంపైనే చర్చించటమే. అదే సమయంలో భవిష్యత్ అడుగులు ఎలా వేయాలన్న అంశంపై కూడా చర్చించుకోవాలనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా హాజరు కావటంతో వ్యవహారం అంతా ఆయన చుట్టూనే తిరిగింది. అధిష్టానం అనుమతి లేకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఎందుకు కలవాల్సి వచ్చిందని సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు, అరవింద కుమార్ గౌడ్ లు రేవంత్ ను ప్రశ్నించారు. అయితే తాను అన్ని విషయాలు చంద్రబాబుతోనే మాట్లాడతానని ప్రకటించటంతో.. మోత్కుపల్లి విసురుగా లేచి అలాంటప్పుడు ఇక సమావేశం ఎందుకు అని అక్కడ నుంచి లేచివెళ్లిపోయారు. అదే సమయంలో ఏపీ మంత్రులు యనమల రామకృష్ణుడు, పరిటాల సునీతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యల విషయంలో కూడా వీరు రేవంత్ తీరును తప్పుపట్టారు.
Related Articles
అయితే రేవంత్ రెడ్డి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబుతో భేటీలోనే అన్ని విషయాలు మాట్లాడతానని తేల్చిచెప్పారు. అయితే తాను పార్టీ మారతానని ఎందుకు ప్రచారం చేస్తున్నారని ఉమా మాధవరెడ్డి కూడా ఈ సమావేశంలో రేవంత్ ను ప్రశ్నించారని చెబుతున్నారు. టీ టీడీపీ సమావేశంలో కూడా నేతలు రెండు గ్రూపులు గా చీలిపోయారు. కొంత మంది రేవంత్ రెడ్డి వైపు ఉండగా..మరికొంత మంది పై ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే విలేకరుల సమావేశంలో మాత్రం అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాం..119 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం కోసం ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేయనున్నట్లు టీడీపీ నేతలు తెలిపారు.
The post అన్నీ చంద్రబాబుతోనే! appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here