ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానికి సంబంధించిన డిజైన్లు ఇంకా ఖరారు కాలేదని..వీటికి మరింత మెరుగుపర్చాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఆయన గురువారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రాజధాని నిర్మాణం ఆలస్యం అయినా రాజీపడేది లేదని, మంచి డిజైన్ల కోసం అందరి సలహాలు తీసుకుంటామని అన్నారు. తమ వాళ్లు తొందరపడి తేదీని ప్రకటించారని చంద్రబాబు అన్నారు. నార్మన్ ఫోస్టర్ డిజైన్లలో మార్పు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళిని డిజైన్ల కోరామని, గతంలో కూడా ఒకసారి ఆయనను అడిగామని చంద్రబాబు తెలిపారు.
Related Articles
రాజధాని కోసం అప్పులు తీసుకొచ్చి…భూములు విక్రయించి, వివిధ సంస్థల ద్వారా నిధులు సమీకరించి రాజధాని నిర్మాణం చేపడతామని సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే పోలవరం అంశంపై కూడా చంద్రబాబు స్పందించారు. ఈ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న ట్రాన్స్ స్ట్రాయ్ పనులు సరిగా చేయడం లేదని, 60 (సి) నిబంధన ప్రకారం కంపెనీకి నోటీసులు ఇచ్చామన్నారు. వాళ్లు చేస్తున్న పనులను రద్దు చేసి వేరేవారికి అప్పగిస్తామని చెప్పారు. పనులు వేరేవారికి అప్పగించినా న్యాయపరమైన ఇబ్బందులు ఉండవని చంద్రబాబు తెలిపారు.
The post రాజధాని డిజైన్లు ఇంకా బాగా రావాలి appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here