పనులు చేయకుండా సోమవారం ఇక నుంచి ‘పోలవారం’ అంటే పనులు హాం ఫట్ అని అయిపోతాయా?. ‘ట్రాన్స్ స్ట్రాయ్’తో పోలవరం కాదని.. 60సీ కింద నోటీసులు ఇచ్చి కంపెనీని మార్చేస్తేనే ప్రాజెక్టు పూర్తవుతుందని రెండేళ్ల క్రితమే అప్పటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యానాథ్ దాస్ లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. కానీ ట్రాన్స్ స్ట్రాయ్ ను మార్చాలన్న ఆదిత్యానాధ్ దాస్ నే చంద్రబాబు మార్చారు తప్ప..కంపెనీని మార్చలేదు. ఫలితం ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ ఎంపీకి చెందిన ట్రాన్స్ స్ట్రాయ్ కంపెనీతో కుమ్మక్కు అయ్యారనే ఆరోపణలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. అందుకే కంపెనీ తరపున ఆయనే అన్ని పనులు చూసుకోవటం మొదలుపెట్టారు. చివరకు సబ్ కాంట్రాక్టర్ల సెటప్ కూడా ఆయనే చేశారు. కొన్ని పనులకు అయితే ప్రభుత్వం ఎదురుడబ్బులు పెట్టి..ఆ పని పూర్తి చేసిన తర్వాత బిల్లులో ఆ మొత్తాన్ని జమ చేసుకుంది. బహుశా దేశ చరిత్రలోనే ఇలా చరిత్ర చంద్రబాబు సర్కారుకు దక్కుతుంది. ఒక్క పోలవరంలోనే కాదు..ట్రాన్స్ స్ట్రాయ్ కి ఇఛ్చిన ఓ ప్రపంచ బ్యాంకు రోడ్డు పరిస్థితి కూడా అదే. సంవత్సరాలు గడిచినా రోడ్డు పనులు పూర్తి చేయని ట్రాన్స్ స్ట్రాయ్ పై చర్యలు తీసుకోవాలని ప్రపంచ బ్యాంక్ ఆదేశిస్తే ..కంపెనీని రక్షించటం కోసం అసలు మాకు మీ రుణం అక్కర్లేదు పోండి అని ప్రపంచ బ్యాంక్ కు లేఖ రాయించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుది. అంతలా చంద్రబాబు ట్రాన్స్ స్ట్రాయ్ తో కుమ్మక్కు అయ్యారు.
Related Articles
నిర్దేశిత గడువులోగా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు కన్పించకపోవటంతో ఇప్పుడు కొత్త డ్రామాకు తెరతీశారు. వారం వారం పోలవరంపై సమీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కాంక్రీట్ పనులు ముందుకు సాగటం లేదని తెలియదా?. ఇప్పుడు కొత్తగా కాంక్రీట్ పనుల్లో జాప్యమా? సమగ్ర నివేదిక అంటూ కొత్త నాటకానికి తెరతీశారని సాగునీటి శాఖ వర్గాలు చెబుతున్నాయి. ప్రతి వారం పోలవరంపై సమీక్ష చేసే సీఎంకు మరి కాంక్రీట్ పనులు జరగటం లేదని తెలియదా?. లేదా ఇదంతా ఉత్తుత్తి వ్యవహారమేనా?. అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పుడు చంద్రబాబు ఎలాగైనా పోలవరం పనులను కొంచెం అటుఇటుగా పూర్తిచేసేందుకు ఇటీవల కాలంలో తనకు ‘ఆత్మీయ కాంట్రాక్టర్’గా మారిపోయిన వ్యక్తికి పనులు అప్పగించేందుకు స్కెచ్ గీస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు..ముగ్గురికి పనులు విభజించి అప్పగించటం ద్వారా పనుల స్పీడ్ పెంచాలని చూస్తున్నారు. మరి దీనికి కేంద్రం ఏ మేరకు ఆమోదం తెలుపుతుందో వేచిచూడాల్సిందే.
The post ‘వారం’ పేరు మారిస్తే పోలవరం పరుగులు పెడుతుందా! appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here