చట్టాలు ఎన్ని తెచ్చినా మహిళలపై అకృత్యాలు ఆగటం లేదు. దేశంలో పలు చోట్ల నిత్యం ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో వివాహిత మహిళలపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఒకటి ఆదివారం నాడు వెలుగులోకి వచ్చింది. ఖానాపూర్ మండలంలో ఎల్లాపూర్ గ్రామ శివారులో ఈ దారుణం చోటుచేసుకుంది. బాధితురాలి భర్త నిర్మల్ వెళ్లటంతో ఆ గ్రామానికే చెందిన డి.ధర్మపురి, కె. గంగాధర్, మరో యువకుడు కలసి బాదితురాలి ఇంటికి చేరుకున్నారు. ఆమె నోరు మూసి గ్రామ శివారులోకి తీసుకెళ్ళారు.
Related Articles
తర్వాత పొదల్లోకి తీసుకెళ్లి ఆమెపై ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఇద్దరి వయస్సు ఇరవై సంవత్సరాలు కాగా..మరో కుర్రాడి వయస్సు అంత కంటే తక్కువే అని పోలీసులు చెబుతున్నారు. అత్యాచారం చేసిన అనంతరం వీరందరూ అక్కడ నుంచి పరారు అయ్యారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు వీరిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
The post వివాహితపై గ్యాంగ్ రేప్ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here