Get Even More Visitors To Your Blog, Upgrade To A Business Listing >>

ఆగని కేశినేని ‘ట్వీట్ వార్’

Tags: agravedeg

తెలుగుదేశం పార్టీలో  ఆ కలకలం అలా కొనసాగుతూనే ఉంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని తన ట్వీట్ల యుద్ధాన్ని ఏ మాత్రం ఆపలేదు. ఆయన మంగళవారం నాడు కూడా తనదైన శైలిలో స్పందించారు. ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన విమర్శలకు స్పందనగా ఆయన ఇది చేసినట్లు కనపడుతోంది. ‘నేను బాలయోగి ఆస్తులు కాజేశానని ఒక్క ప్రబుద్ధుడు చెప్పింది యదార్థం. బాలయోగి కి ఉన్న ఆస్తులు నీతి,నిజాయితీ విలువలు,సిద్ధాంతాలు ప్రజల్ల పట్ల అంకితభావం,ప్రాంతాన్ని అభివృద్ధి చేసే చిత్తశుద్ధి వీటిని కాజేసి  పాటిస్తున్నందుకు చాలా గర్వ పడుతున్నాను.’ అని పేర్కొన్నారు.

ఇటీవల బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ లో  ‘‘దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?’’ అంటూ కేశినేని నానిని ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేశినేని సమాధానం ఇచ్చారు. టీడీపీ అధిష్టానం మాటలను కేశినేని నాని బేఖాతర్ చేస్తున్నట్లు దీన్ని బట్టి కనపడుతోంది.



This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here

Share the post

ఆగని కేశినేని ‘ట్వీట్ వార్’

×

Subscribe to Verify Exam Results - Updated Government Jobs In India

Get updates delivered right to your inbox!

Thank you for your subscription

×