‘నిజాయతీగా బతికా. ఏ విచారణకైనా సిద్ధమే’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు సోమవారం నాడు అసెంబ్లీలో వ్యాఖ్యానించగా..అధికార వైసీపీ సభ్యులు పెద్ద ఎత్తున కేకలు వేశారు. గొడవ చేస్తే ఉపయోగం ఉండదని..గతంలోనూ తన మీద విచారణ కమిటీలు వేశారని అన్నారు. ఈ అంశంపై తాను తర్వాత మాట్లాడతానని..రాష్ట్రానికి ఏది మంచో దాని కోసమే తాను విదేశీ పర్యటనలు చేశానని చెప్పారు.
Related Articles
ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వమే తన నివేదికలో ఒప్పుకుందని..మరో 16 లక్షల కోట్లకు ఒప్పందాలు జరిగాయని… ఈ ఒప్పందాలు అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. దీనిపై ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ పెట్టుబడులు వేల కోట్లు..ఉద్యోగాలు కోట్లు అని ప్రచారం చేసుకున్నారని..ఇఫ్పుడు అవేమీ కన్పించలేదన్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here