నితిన్ యమా దూకుడు మీద ఉన్నారు. వరస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఆయన 29వ సినిమానే ‘రంగ్ దే’. ఈ సినిమా టైటిల్ ను చిత్ర యూనిట్ సోమవారం నాడు ప్రకటించింది. ఇందులో మరో విశేషం ఉంది. ఈ సినిమాలో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. వెంకీ అట్లూరితో కలిసి చేయబోయే ఈ కొత్త సినిమా విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు నితిన్.
Related Articles
ఈ సినిమాకు రంగ్దే అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలిపాడు. ఈ మూవీని సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశీ నిర్మించగా.. సినిమాటోగ్రఫర్గా పీసీ శ్రీరామ్ పనిచేయనున్నారు. ఇప్పటికే నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్ర షూటింగ్ను ప్రారంభించగా.. చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్లో మరో సినిమాను ఆదివారం ప్రారంభించిన సంగతి తెలిసిందే.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here