తెలంగాణ పాకిస్థాన్ అయితే హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కుటుంబాలు ఎలా ఉంటున్నాయని బిజెపి ప్రశ్నించింది. చంద్రబాబు మాటలు వింటే పవన్ కళ్యాణ్ తన రాజకీయ భవిష్యత్ అంధకారం చేసుకున్నట్లేనని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు వ్యాఖ్యానించారు. ఆంధ్ర ప్రజలపై తెలంగాణలో దాడులు చేస్తున్నారని ఏపీ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఈ నెల 29న రాజమండ్రి, ఏప్రిల్ 1న కర్నూలుల్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొంటారని అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్తో పాటు ముఖ్యమైన జాతీయ నాయకులు రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారని చెప్పారు.
Related Articles
ఈ నెల 26న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మేనిఫెస్టోను పీయూష్ గోయల్ విడుదల చేస్తారని తెలిపారు. ఏపీలో ఎన్నికలు ధన మయమైయ్యాయి.. దీనిపై సోమవారం ఎన్నికల కమిషన్ ను కలిసి టీడీపీ ధన రాజకీయాలు పై ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు రూ. 30 కోట్లు, మంత్రులు వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఏపీ ఎన్నికల్లో 6 వేలు కోట్లు ఖర్చు చేయడానికి సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని విమర్శించారు. బాబు ధన ప్రవాహానికి ఎన్నికల సంఘం అడ్డుకట్టు వేయాలి అన్నారు. సీఎం చంద్రబాబు మాటలనే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రిపీట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ ప్యాకేజీ కళ్యాణ్ గా మారారని ఎద్దేవా చేశారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here