ఎన్నికల ముందు ప్రతిదీ పంచాయతీనే. ఇప్పుడు దేశంలోని ప్రధాన పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ ల మద్య ‘హెలికాఫ్టర్ల’ వివాదం ప్రారంభం అయింది. వచ్చే లోక్ సభ ఎన్నికల సమయంలో తమ నేతల ప్రచారానికి అవసరంమైన హెలికాఫ్టర్లు అందుబాటులో లేవని..చేతి నిండా డబ్బులు ఉన్న బిజెపి భారీ ఎత్తున హెలికాఫ్టర్లను ఇఫ్పటికే బుక్ చేసుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగనున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రచారం ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఎక్కువ సభలను కవర్ చేయాలంటే ప్రత్యేక హెలికాఫ్టర్లు ఉండాల్సిందే.
Related Articles
ప్రతి ఎన్నికల సమయంలోనూ అన్ని పార్టీలు హెలికాఫ్టర్ లను అద్దె తీసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటాయి. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇఫ్పటికే అందుబాటులో ఉన్న హెలికాఫ్టర్లలో ఎక్కువ శాతం బిజెపి బుక్ చేసుందని చెబుతోంది. అందుకు ఆ పార్టీ వద్ద పెద్ద ఎత్తున వనరులు కూడా ఒక కారణం అని పేర్కొంది. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ ప్రకటించారు. అయితే ఈ ఆరోపణలను బిజెపి తోసిపుచ్చుతూ..కాంగ్రెస్ పార్టీని ‘అబద్ధాల మిషన్’గా అభివర్ణించింది.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here