ఎన్నికల ముందు కృష్ణా జిల్లాలో ప్రతిపక్ష పార్టీకి షాక్. ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు పంపారు. తన భవిష్యత్ కార్యాచరణను ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తానని..అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. గత కొంత కాలంగా రాధా పార్టీని వీడతారని ప్రచారం జరిగినా ఇంత కాలం ఆయన మౌనంగా ఉంటూ వచ్చారు. సడన్ గా ఇప్పుడు వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు. చివరి నిమిషం వరకూ వైసీపీ అధిష్టానం ఆయనతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకుండా పోయింది.
Related Articles
వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పార్టీ మారొద్దని అధిష్టానం టికెట్ విషయంలో న్యాయం చేస్తుందని వంగవీటి రాధాకృష్ణతో మాట్లాడారు. వంగవీటి రాధాకృష్ణ గత కొన్నిరోజులుగా టికెట్ విషయంలో అధిష్టానం వైఖరిపై అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ సెంట్రల్ సీటు ఇవ్వాలని ఆయన కోరగా.. పార్టీ మాత్రం విజయవాడ తూర్పునుంచి పోటీ చేయాలని కోరింది. ఈ పరిణామంతో తీవ్ర అసంతృప్తికి లోనైన రాధా పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here