తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కారు జోరు సాగినా కూడా కీలక మంత్రులు ఓటమి పాలవటం విశేషం. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ అభ్యర్ధి ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల 1950 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలి నుంచి పాలేరులో తుమ్మల గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్లు ప్రచారం జరిగింది. ప్రచారం జరిగినట్లుగానే ఆయన స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు.
Related Articles
మరో మంత్రి జూపల్లి కృష్ణారావుదీ అదే పరిస్థితి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కొల్లాపూర్ నుంచి బరిలో నిలిచిన జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ అభ్యర్ధి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓటమి చెందారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి తాండూరులో మరో మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కూడా ఇంటిబాట పట్టారు. పట్నం మహేందర్ రెడ్డిపై కాంగ్రెస్ అభ్యర్ధి పైలట్ రోహిత్ రెడ్డి విజయం సాధించారు.మరో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇంటి బాట పట్టారు. కాంగ్రెస్ అభ్యర్ధి మహేశ్వర్ రెడ్డి చేతిలో ఆయన ఓడిపోయారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here