ఇప్పుడు అందరిలో ఇదే అనుమానం. తెలంగాణ ఫలితాలు చూసిన తర్వాత కూడా తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తారా?. ఇంకా ఆ పార్టీతో కలసి ముందుకు సాగుతారా?. కాంగ్రెస్ పై తన వైఖరి మార్చుకుంటారా?. తెలంగాణలో జరిగిన దారుణ ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్ నేతలు సహజంగా చంద్రబాబును టార్గెట్ చేస్తారు. జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ కోసం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తోపాటు మరికొంత మంది నేతలతో కలసి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను విస్తృతంగా ప్రచారం చేసిన తెలంగాణలో కూటమి దారుణంగా దెబ్బతినటం..ఆ ప్రభావం ఖచ్చితంగా ఏపీ రాజకీయాలపై పడే ప్రభావం ఉంది. అంతే కాదు..జాతీయ స్థాయి లో ఈ కూటమి రాజకీయాలకు మరి చంద్రబాబు బ్రేక్ వేస్తారా? లేక అలాగే మందుకు సాగుతారా?. వేచిచూడాల్సిందే.
Related Articles
ఏపీకి చెందిన కొంత మంది టీడీపీ నేతలు మాత్రం చంద్రబాబునాయుడు తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ జోక్యం చేసుకుని లేనిపోని తలనొప్పులు తెచ్చుకున్నట్లు అయిందనే భావనలో ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఫలితాలు మాత్రం ఏపీ రాజకీయాల్లో కూడా ప్రకంపనల సృష్టించటం ఖాయంగా కన్పిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో చంద్రబాబు ప్రచారంపై విమర్శలు చేశారు. ఏపీలో ప్రజల సమస్యలను వదిలేసి..తెలంగాణలో ప్రచారం ఏంటి? అని జగన్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై జగన్ ఎటాక్ మరింత పెరగటం ఖాయంగా కన్పిస్తోంది. ఈ అంశాలు అన్నింటిని పరిశీలిస్తే చంద్రబాబు భవిష్యత్ నిర్ణయాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here