సినీ హీరోలు అందరూ ఓటు వేసేందుకు క్యూ కట్టారు. మెగా స్టార్ చిరంజీవితోపాటు జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, అల్లు అర్జున్, రాజమౌళి, నిఖిల్ ఇలా అందరూ పోలింగ్ బూత్ కు క్యూకట్టారు. చిరంజీవి, ఎన్టీఆర్ లు కుటుంబ సభ్యులతో వచ్చి క్యూలో నిలుచుని ఓటు వేశారు. జూబ్లీహిల్స్ ఓబుల్రెడ్డి పబ్లిక్ స్కూల్లోని పోలింగ్ బూత్లో జూనియర్ ఎన్టీఆర్ తన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ యువత ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. తన అక్క సుహాసిని విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతకు మించి పోలింగ్ బూత్ లో ఇతర అంశాలు మాట్లాడటం సరికాదని..ప్రచారానికి రాకపోవటంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇఛ్చారు.
Related Articles
శుక్రవారం ఉదయమే తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం అయింది. పోలింగ్ విషయంలో ఎన్నికల సంఘం సరైన ఏర్పాట్లు చేయలేదని చాలా కేంద్రాల్లో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉదయాన్నే ఓటువేద్దామని పోలింగ్ కేంద్రాలకు వచ్చినా కూడా ఈవీఎంలు పని చేయక, ఏజెంట్లు కొన్ని చోట్ల రాక పోలింగ్ ఆలస్యమవుతోంది. దీంతో చాలా మంది ఓటర్ల వెనుదిరిగి వెళుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 229 పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మోరాయించాయి. 20 కేంద్రాల్లో ఇంకా పోలింగ్ ప్రారంభం కాలేదు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here