అందరి మదిలో ఇప్పుడు అదే ప్రశ్న. దేవుడిని ఏ మాత్రం నమ్మనని చెప్పే రామ్ గోపాల్ వర్మ ఆకస్మాత్తుగా ఎందుకు భక్తుడిగా మారిపోయారు?. దీని వెనక ఉన్న కారణాలు ఏంటి?. కమ్యూనిస్టులు అకస్మాత్తుగా భక్తులుగా మారిపోయినట్లు…వర్మ కూడా సడన్ గా ఇలా మారిపోయారేంటబ్బా? అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. రామ్ గోపాల్ వర్మ శుక్రవారం నాడు చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వినాయకుడిని దర్శించుకున్నారు. అక్కడ పూజలు నిర్వహించారు కూడా.
Related Articles
దేవాయలంలోని పండితులు వర్మతో పాటు..ఆయనతో వచ్చిన భక్తులకు అశీర్వచనాలు అందించారు. తర్వాత ఆలయం అంతా తిరిగి చూశారు వర్మ. రామ్ గోపాల్ వర్మ ముందుగానే తాను తొలిసారి దేవుడిని దర్శించుకోనున్నట్లు ప్రకటించారు. కాణిపాకం తర్వాత వర్మ టీమ్ తిరుమలలో వెంకటేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. దేవుడి దర్శనం అనంతరం తాను కొత్తగా నిర్మించనున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడిస్తానని తెలిపారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here