హైదరాబాద్ నుంచి స్వామి పరిపూర్ణానందను బహిష్కరించిన అంశంపై బిజెపి ఎంపీ సుబ్రమణ్యస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే చట్టపరంగా ముందుకెళతానని..అదే సమయంలో నష్టపరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు సుబ్రమణ్యస్వామి తెలంగాణ సీఎం కెసీఆర్ కు గురువారం నాడు లేఖ రాశారు. పరిపూర్ణానందస్వామిని 1980 సంవత్సరానికి సంబంధించి సంఘ వ్యతిరేక, ప్రమాద కార్యకలాపాల నిరోధక చట్టంలోని సెక్షన్ యు/ఎస్ 3 ప్రకారం నగరం నుంచి బహిష్కరించారని..ఇది గుండాలను నగరం నుంచి బహిష్కరించేందుకు ఉద్దేశించిన సెక్షన్ అని పేర్కొన్నారు.
Related Articles
ప్రభుత్వం ఓ సారి సెక్షన్ 3లో ఏమి ఉందో సరిచూసుకోవాలన్నారు. సమాజంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్న ఓ స్వామిజీని ఎలా గూండా చట్టం ప్రకారం బహిష్కరిస్తారని సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. ఇది పరిపూర్ణానందను అవమానించటం, పరువుకు నష్టం కలిగించే చర్య అని తన లేఖలో పేర్కొన్నారు. ఇది పరిపూర్ణానంద హక్కులను హరించటమే అన్నారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here