దిల్లీ: దిల్లీలోని బహదూర్ షా జాఫర్ మార్గ్ లో వున్న టైమ్స్ ఆఫ్ ఇండియా బిల్డింగ్లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ మొదటి అంతస్తులో వున్న సర్వర్ రూమ్లో సాయంత్రం 4:30 గంటలకు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అప్రమత్తమైన మేనేజ్మెంట్ వెంటనే సిబ్బందిని సురక్షితంగా ఖాళీ చేయించింది.
Related Articles
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే 10 ఫైర్ ఇంజన్లను టైమ్స్ ఆఫ్ ఇండియా ఆఫీస్కి తరలించి మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యాయి. ఎంతకి మంటలు అదుపులోకి రాకపోవడంతో మరో 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దింపినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.
అయినప్పటికీ మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరో 10 ఫైర్ ఇంజిన్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని చుట్టుముట్టాయి. మొత్తం 30 ఫైర్ ఇంజిన్లు మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నం అయ్యాయి.
The post టైమ్స్ ఆఫ్ ఇండియా దిల్లీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం appeared first on .