విజయవాడ పారిశ్రామికవేత్తతో కలసి పది రోజులు మకాం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నెలలో వారం నుంచి పది రోజుల పాటు సింగపూర్ లో ఎందుకు మకాం వేశారు?. అక్కడ ఏమి జరిగింది?. ఈ మకాంలో కీలకపాత్రదారి విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కావటం విశేషం. వీరిద్దరితో పాటు మరో ముఖ్యనేత కూడా ఉన్నారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఆయన సొంతంగా ఎన్ని సీట్లు గెలుస్తారు అనే దానికన్నా ఎవరి గెలుపు అవకాశాలను దెబ్బతీస్తారు అన్నదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఓ వైపు తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్న పవన్ కళ్యాణ్ ఆ పారిశ్రామికవేత్తతో కలసి పది రోజులు సింగపూర్ లో ఉండటంతో రాజకీయ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ పారిశ్రామికవేత్త ఎవరో కాదు…సీఎం చంద్రబాబుకు కరకట్ట సమీపంలో ఉచితంగా ఇళ్ళు ఇచ్చి..ఓ ఎయిర్ లైన్స్ ప్రారంభించి మధ్యలోనే మూసేసిన వ్యక్తి అని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Related Articles
గతంలో పవన్ కళ్యాణ్ కు ..ఆ పారిశ్రామికవేత్తకు మధ్య ఏ మాత్రం సంబంధాలు లేవు. కానీ అకస్మాత్తుగా ఇంతగా ‘బంధం’ బలపడటానికి కారణం ఏమై ఉంటుంది?. ఇదే పారిశ్రామికవేత్తకు చెందిన సంస్థలు ఏపీ ప్రభుత్వంతో వేలాది కోట్ల రూపాయలకు సంబంధించిన ‘ఉత్తుత్తి’ ఎంవోయులు కుదుర్చుకున్నాయి. అందులో ఒక్కటి కూడా పట్టాలెక్కలేదు. సింగపూర్ లో వీరి రహస్య సమావేశం వెనక అసలు ఉద్దేశాలు ఏమిటనే అంశంపై కొంత మంది టీడీపీ నేతల్లో కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బహిర్గతం కాలేదు కానీ..ఇది పూర్తిగా రాజకీయ కోణంలోనే సాగిందని చెబుతున్నారు. దీని వెనక పెద్ద కథే ఉందని..అది ఎన్నికల తర్వాత బహిర్గతం అవుతుంది తప్ప..ఇప్పట్లో అయ్యే అవకాశం లేదని టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here