వరుణ్ తేజ్. ఈ మధ్య హిట్ ట్రాక్ లో పడ్డ హీరో. ఫిదా నుంచి మొదలుకుని తొలిప్రేమ వరకూ ఈ యువ హీరోకు మంచి ఫలితాలు దక్కాయి. దీంతో కొత్త సినిమాల విషయంలో కూడా వరుణ్ తేజ్ మరింత ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. మొదటి నుంచి కూడా విభిన్నమైన కథలకే ప్రాధాన్యత ఇచ్చిన ఈ హీరో..భవిష్యత్ లోనూ అదే బాటలో పయనించనున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాకు ఓకే చెప్పేశాడు.
Related Articles
ఈ సినిమాకు దర్శకత్వం వహించేది భారతీయ సినీచరిత్రలో తొలి అండర్ వాటర్ వార్ డ్రామాగా తెరకెక్కిన సినిమా ఘాజీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి కావటం విశేషం. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాలీవుడ్ టాక్.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here