తెలంగాణ…ఆంధ్రప్రదేశ్. 2014 నవంబర్ అంటే అప్పుడే అధికారంలోకి వచ్చిన తొలి రోజులు. ఏపీకి అసలు రాజధానే లేదు కదా. రోజూ పత్రికల్లో చంద్రబాబు ‘సింగపూర్’ మోడల్ భవనాలు..జపాన్ మోడల్ అంటూ ఒకటే హడావుడి. ఇది చూసిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కూడా మనకు కూడా అలాంటి భవనాలు ఉండాల్సిందే అని ఒక ప్రకటన చేశారు. అంతే అద్భుతమైన డిజైన్లను పత్రికలకు విడుదల చేశారు. హైదరాబాద్ -సికింద్రాబాద్ ల ను కలిపే హుస్సేన్ సాగర్ పక్కన అద్భుతమైన ఆకాశహర్మ్యాలను నిర్మిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడింది సరిగ్గా 2014 నవంబర్ 13న. అంటే దాదాపు మూడేళ్ళు కావస్తోంది.
Related Articles
కానీ ఈ దిశగా ఎలాంటి అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. కౌలాంలపూర్ లోని పెట్రోనాస్ ట్విన్ టవర్స్, ముంబయ్ లోని సీఫ్రంట్ టవర్స్ లా అరవై నుంచి వంద అంతస్థుల భవనాలు నిర్మించాలని ప్రతిపాదించారు. వాటిలో ప్రభుత్వ ఆఫీసుల తోపాటు వ్యాపార సముదాయాలు, ఎంటర్ టైన్ మెంట్ సెంటర్స్ వంటి వాటికి చోటు కల్పించాలని సీఎం కెసీఆర్ సమీక్షలో నిర్ణయించారు. ఈ భవనాల నిర్మాణానికి అవసరమైన భూమి కూడా అందుబాటులో ఉందని గుర్తించారు అప్పట్లోనే. కానీ ఇఫ్పటివరకూ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల అలాంటి ప్రాజెక్టు ఏ ఒక్కటీ టేకాఫ్ కాలేదు. ఇదొక్కటే కాదు..హుస్సేన్ సాగర్ శుద్ధీకరణ ప్రాజెక్టు కూడా అంతే అటకెక్కింది. సీఎం కెసీఆర్ అయితే ఏకంగా హుస్సేన్ సాగర్ నీళ్లనే తాగేలా చేస్తానని ప్రకటించారు. కానీ ఇది కూడా మూలనపడింది.
The post అడుగు ముందుకు పడని ‘కెసీఆర్ కలల ప్రాజెక్టు’ appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here