ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున అక్రమంగా నిర్మించిన నిర్మాణంలో చంద్రబాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తొలుత సాగునీటి శాఖ ఇది అక్రమ కట్టడమే అని తేల్చింది. తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కరకట్ట నివాసంలో చేరిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు నదీపరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారనే కారణాలతో మరో 57 మందికి కూడా కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ అక్రమ నిర్మాణాల వ్యవహారంపై వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం…అందరికీ నోటీసులు జారీ చేసింది.
Related Articles
ఇందుకు సంబంధించి మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. సీఎం చంద్రబాబు ప్రస్తుతం నివాసం ఉంటున్న ఇంటిని నదీ పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా నిర్మించిన లింగమనేని గ్రూపు నుంచి లీజుకు తీసుకున్నారు. ఇందులో లింగమనేని రమేష్, నర్సాపురం ఎంపీ గోకరాజు గంగరాజులకు చెందిన భవనాలు, మంతెన సత్యనారాయణరాజుకు చెందిన ప్రకృతి ఆశ్రమం కట్టడాలున్న విషయం విదితమే. పలువురు సినీ హీరోలు కూడా ఈ ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టారు.
The post చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here