ఇప్పుడు అందరి మదిలో ఇదే ప్రశ్న. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టిన మియాపూర్ భూ కుంభకోణం విషయంలో కొద్ది రోజుల క్రితం తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే విపక్షాలు భూ స్కామ్ లో సీఎం కెసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు. అదే సమయంలో గత ప్రభుత్వ హయాంలో సాగిన భూ దందాలకు సంబంధించి విపక్షాలకు చెందిన నేతల జాతకాలు బయటపెడతామని సంచలన ప్రకటన చేశారు. తమదగ్గర దీనికి సంబంధించి పెద్ద జాబితానే ఉందని హెచ్చరించారు. అప్పట్లో హరీష్ రావు ప్రకటన పెద్ద కలకలమే రేపింది. అంటే ప్రభుత్వంపై విమర్శలు చేస్తే వారి జాతకాలు బయటపెడతారన్న మాట. లేదంటే లేదు. అయితే కారణాలు ఏమిటో తెలియదు కానీ…హరీష్ రావు ప్రకటన చేసి నెల రోజులు దాటినా ఇప్పటివరకూ భూ కుంభకోణాల్లో ఉన్నారని చెబుతున్న ఒక్క ప్రతిపక్ష నాయకుడి పేరు కూడా ప్రభుత్వం వెల్లడించలేదు. తమ దగ్గర చాలా జాతకాలు ఉన్నాయని చెప్పిన సర్కారు ఎందుకు మౌనంగా ఉంటోంది.
Related Articles
నిజంగా వారి దగ్గర ఏమైనా జాతకాలు ఉన్నాయా? లేక బెదిరించటానికే ఇలా చేశారా? అన్న చర్చ అధికార వర్గాల్లో సైతం సాగుతోంది. మియాపూర్ భూ స్కామ్ లో కెసీఆర్ ఫ్యామిలీకి చెందిన పలువురిపై విపక్షాలు ఆరోపణలు చేశారు. కొన్నికార్ల నెంబర్లు బయటపెట్టడంతో ..గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో వీరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించాయి. ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం బట్టబయలు కావటంతో మియాపూర్ స్కామ్ పూర్తిగా వెనకపడిపోయింది. అయితే సాక్ష్యాత్తూ ప్రభుత్వంలోని కీలకమంత్రి ఒకరు ప్రతిపక్షాల జాతకాలు బయటపెడతామని ప్రకటించి..ఇప్పటి వరకూ ఏమీ చేయపోవటంతో ఇది కేవలం బెదిరింపు కోసమే చేశారా? అన్న అంశం తెరపైకి వస్తుంది. అంటే తమపై వస్తున్న విమర్శలను తప్పించుకోవటానికే దీన్ని అస్త్రంగా వాడారనే విమర్శలూ ఉన్నాయి.
The post హరీష్ రావు ఆ జాతకాలు బయటపెట్టరే! appeared first on Online Telugu Newspaper.
This post first appeared on Verify Exam Results - Updated Government Jobs In India, please read the originial post: here